Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (16:51 IST)
ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐ‌ను కాల్చి చంపేశాడు. ఈ దారుణం మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య ఈ ఘర్షణలు  చోటు చేసుకుంటున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్‌లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్ఐ షాజహాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శనివారం తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్ఐ కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిప్రాణాలు కోల్పోయాడు. 
 
తుపాకీ శబ్దం వినిపించిన మిగిలిన పోలీస్ సిబ్బంది బిక్రమ్ జిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కానిస్టేబుల్, ఎస్ఐల మధ్య కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments