Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం : కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి హత్య

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:32 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కదులుతున్న ఆటోలో ఓ వ్యక్తి మహిళను గొంతుకోసి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దీపక్, పంచశీల (30) అనే ఇద్దరు సోమవారం ఓ ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో దీపక్ తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. నిందితుడి బారినుంచి తప్పించుకునేందుకు మహిళ ఆటో దిగి పరుగులు పెట్టినప్పటికీ కొద్ది దూరం వెళ్లాక కిందపడిపోయింది. ఆ తర్వాత అతను కూడా అదే కత్తితో తన గొంతుకు కోసుకున్నాడు. 
 
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, మహిళ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరికీ ముందుగానే పరిచయం ఉందని, ఆటోలో వారి మధ్య గొడవ తలెత్తడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, గొంతు కోయడానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్వనీదత్ చేతిలో వున్న లెటర్ లో ఏముందో తెలుసా !

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments