Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం : కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి హత్య

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (16:32 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కదులుతున్న ఆటోలో ఓ వ్యక్తి మహిళను గొంతుకోసి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దీపక్, పంచశీల (30) అనే ఇద్దరు సోమవారం ఓ ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో దీపక్ తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. నిందితుడి బారినుంచి తప్పించుకునేందుకు మహిళ ఆటో దిగి పరుగులు పెట్టినప్పటికీ కొద్ది దూరం వెళ్లాక కిందపడిపోయింది. ఆ తర్వాత అతను కూడా అదే కత్తితో తన గొంతుకు కోసుకున్నాడు. 
 
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, మహిళ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరికీ ముందుగానే పరిచయం ఉందని, ఆటోలో వారి మధ్య గొడవ తలెత్తడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, గొంతు కోయడానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments