మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:52 IST)
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఓ ఉపాధ్యాయుడుకి 111 యేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను విధించింది. అలాగే, 1.05 లక్షల అపరాధం కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో యేడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
 
గత 2019 జూలై రెండో తేదీన నిందితుడు మనోజ్ (44) ఐదేళ్ల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసే విద్యార్థిని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుపై ఏమాత్రం కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొంటూ 111యేళ్ళ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రత్యేక క్లాస్ పేరుతో బాధిత బాలికను ఇంటికి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ దారుణాని మొబైల్‌ ఫోనులో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుదితీర్పును వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం