Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగిని హత్య చేసి.. విద్యుత్ షాక్‌గా చిత్రీకరించే ప్రయత్నం

Webdunia
సోమవారం, 10 జులై 2023 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తన వద్ద పని చేసే ఓ ఉద్యోగిని హత్య చేసి, దాన్ని విద్యుత్ షాక్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే గజానన్‌ ఓ కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం యజమానికి, అతడికి చిన్న వివాదం జరిగింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ఆ యజమాని అతడికి నిప్పంటించి హతమార్చాడు. అనంతరం గజానన్‌కు విద్యుత్‌ షాక్‌ కొట్టిందని ఊళ్లో తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాకుండా ఆస్పత్రికి కూడా తరలించాడు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో యజమానిపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments