Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటివారి గొడవతో మనస్తాపం - మహిళ ఆత్మహత్య - లారీ కింద పడి భర్త మృతి

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (14:14 IST)
పొరుగింటివారు గొడవపడ్డారు. దీన్ని చూసిన మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మనస్తాపంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) దంపతులు. పొరుగింటి వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఈనెల 13న శరణ్య పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శరణ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. 
 
ఆదివారం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో.. లక్సెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తా వద్ద మల్లికార్జున్‌ రావు వస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతిచెందారు. దంపతుల మృతితో వారి ఇద్దరి పిల్లలు అనాథలు మారారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments