Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిలో కాకినాడ యువకుడి కిడ్నాప్ - కరెంట్ షాక్‌తో చిత్రహింసలు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (10:17 IST)
గుంటూరు జిల్లా తెనాలిలో కాకినాడ యువకుడు కిడ్నాప్‌ చేసి కరెంట్ షాక్‌తో చిత్రహింసలు పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ పెద్దాపురానికి చెందిన సతీశ్ అనే యువకుడు గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల వేతనం మణిదీప్ ఇవ్వాల్సివుంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచుకూ మణిదీప్‌కు ఫోన్ చేస్తుండేవాడు. 
 
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఫోన్ చేయడంతో విజయవాడ వచ్చి తీసుకెళ్లాలని మణిదీప్ చెప్పాడు. దీంతో అతని మాటలు నిజమని నమ్మి శుక్రవారం సాయంత్రం విజయవాడకు వచ్చిన సతీశ్‌ను మణిదీప్‌తో సహా మరో నలుగురు బలవంతంగా కారులో ఎక్కించుకుని తెనాలి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతడిపై అందరూ కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కరెట్ షాక్ ఇచ్చి బంధించారు.
 
ఆ తర్వాత సతీశ్‌ను అర్థరాత్రి కారులో ఎక్కించుకుని తీసుకెళతుండా తెనాలి - గుంటూరు వంతెనపై పోలీసులు వాహనం వస్తుండటంతో బాధితుడు కేకలు వేశాడు. దీంతో నిందితులు కారు ఆపడంతో సతీశ్ వెంటనే బయటకుదూకి పోలీసలకు విషయం చెప్పడంతో నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పారిపోయినట్టు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments