Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (14:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలే వీటికి ప్రధాన కారణంగా ఉంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆలయ పూజారి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో వెంకట సాయి సూర్య కృష్ణ అనే వ్యక్తి ఆలయ పూజారిగా పని చేస్తున్నారు. ఈయన తన ఆలయానికి వచ్చే అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఆమె తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. 
 
నిజానికి పూజారికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన పూజారి.. ఆ మహిళతో గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం సాగిస్తూ వచ్చాడు. 
 
అయితే, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసాడు. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్‌లోనే మ్యాన్ హోల్లో పడేశాడు.
 
ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐఏ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలను తేల్చారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments