Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి దక్కలేదని పెళ్లి మండపంలోనే ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (08:56 IST)
తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఓ భగ్న ప్రేమికుడు.. ఆ పెళ్లి మండపంలోనే శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ దారుణం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 
 
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్ (19) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అయితే, జూన్ 30వ తేదీ రాత్రి 11 గంటలకు లంగర్ హౌస్ రింగ్ రోడ్ వద్ద ఉన్న మొగల్ ఫంక్షన్ హాల్లో అమ్మాయికి వేరే వారితో పెళ్లి జరుగుతోందన్న విషయం అశ్వక్​కు తెలిసింది. 
 
దీంతో వెంటనే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని ఒంటిపైన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశ్వక్ కన్నుమూశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments