Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (12:51 IST)
హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క ఇంటి యజమానిని చంపేసింది. అత్యంత ప్రేమగా చూసుకుంటూ వచ్చిన ఈ పెంపుడు కుక్క ఇంటి యజమానిని చంపడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తున్నాయి. 
 
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు... పవన్ కుమార్ అనే వ్యక్తి తన నివాసంలోనే మరణించివుండగా అతడి మృతికి పెంపుడు కుక్కదాడే కారణమని అనుమానిస్తున్నారు. మధురానగర్‌లో నివసించే కుమార్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నాడు. 
 
ఇటీవల పవన్‌ను కలిసేందుకు స్నేహితుడు సందీప్‌ అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా, తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సందీప్, బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్‌ కుమార్‌ను చూసి షాక్‌‍కు గురయ్యారు. 
 
గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్‌ను గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటం, కుక్క నోటికి రక్తం ఉండటంతో ఆ కుక్కే పవన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపి ఉంటుందని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినివేసినట్టు తెలుస్తోంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments