Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణం జరిగింది. నిద్రపోతున్న భార్యను కట్టుకున్న భర్త అతికిరాతకంగా గొంతుకోశాడు. తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రీన్ బేగం అనే అమ్మయిని ఫర్వేజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. అయితే భర్త వేధింపులు భరించలేని ఆమె విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత పెద్దల సమక్షంలో మళ్లీ రాజీకొచ్చిన ఫర్వేజ్.. సమ్రీన్‌ను మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. పైగా సమ్రీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన ఫర్వేజ్... తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ గాఢ నిద్రలో ఉండగా ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఫర్వేజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలికి వచ్చిన సమ్రీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమ్రీన్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments