Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేంద్ర నగర్ పీఎస్‌ పరిధిలో మహిళపై సామూహిత అత్యాచారం

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (10:40 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆటోలో ఎక్కిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై రాజేంద్ర నగర్ సీఐ కనకఈయ్య వెల్లడించిన వివరాల మేరకు.. సిటీలోని పురానాపూల్​కు చెందిన మహిళ(30) బుధవారం హైదర్ గూడకు పని మీద వచ్చింది. తిరిగి పురానాపూల్ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఉండగా, ఆటోలోని వ్యక్తులు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పోనిచ్చారు.
 
లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు గురువారం రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్​ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్​ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం