Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ఐవీఆర్
శనివారం, 11 జనవరి 2025 (12:41 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రెహాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. ఇంటి ఎదురుగా పశువులను మేపుతున్న కార్మికుడిపై ఇంటి యజమాని దుర్భాషలాడటమే కాకుండా నీ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంటా చూస్తూ వుండు అని సవాల్ విసిరాడు. ఈ మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన కార్మికుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... జనవరి 4వ తేదీన కార్మికుడు తన పశువులకు మేత మేపేందుకు చెరకు మిల్లు నుంచి చెరకు చెత్తను తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో తన ఇంటి బయట పశువులకు మేత తినిపిస్తున్నాడు. ఇంతలో పొరుగింట్లో వుండే నీతూ అనే యువకుడు బయటకు వచ్చి పశువులకు వేసే చెత్తనంతా మా ఇంట్లో పడేట్లు చేస్తున్నావంటూ అతడితో వాగ్వాదానికి దిగాడు.
 
ఈ వాదనలో నీతూ మరింత రెచ్చిపోయి.. నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటా, నువ్వు చూస్తూ వుండు అని సవాల్ విసిరాడు. ఈ మాటలకు తీవ్ర మనస్థాపం చెందిన కార్మికుడు వెంటనే విషం తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. విషయం తెలుసుకుని అతడిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments