అత్యాచారం చేసి జైలుకెళ్లాడు, బెయిల్ పైన విడుదల చేస్తే మళ్లీ బాలికను కిడ్నాప్ చేసి....

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:41 IST)
ప్రేమ పేరుతో ఓ బాలికను వంచించి అత్యాచారం చేసాడు ఆ కామాంధుడు. అత్యాచారం కేసులో అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిందితుడు జైలు నుంచి విడుదలైన తర్వాత అదే మైనర్ బాలికను మళ్లీ చిత్రహింసలకు గురిచేశాడు. నిందితుడిని 21 ఏళ్ల మయూర్ రమేష్ కోలిగా గుర్తించారు.

 
జామ్నేర్ తాలూకాలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమెకు మయూర్ రమేష్ కోలీతో ప్రేమ వ్యవహారం నడిచింది. ఐతే పెళ్లికి ముందే తన కోర్కె తీర్చాలన్నాడు మయూర్. అందుకు ఆమె ససేమిరా అనడంతో తన స్నేహితుడి సహాయంతో సూరత్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు.

 
ఆమెను చెరబట్టి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మయూర్ కోలీపై అపహరణ, చిత్రహింసల కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనుమానితుడు మయూర్‌ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేసారు.

 
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆ నిందితుడు మళ్లీ మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిపోయిన ఆ బాలిక మౌనం పాటించింది. అతడి వేధింపులు తీవ్ర రూపం దాల్చి ఆమె కాలిపై గాయం చేసాడు. దాంతో ఆమెను చికిత్స కోసం చేర్చగా ఆమె గర్భవతి అని తేలింది. నెలలు నిండకుండానే బాలిక ప్రసవించడంతో పుట్టిన పాప చనిపోయింది. తన పట్ల క్రూరంగా ప్రవర్తించిన అతడిపై బాలిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం