Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థోస్కోపీ కోసం ఆస్పత్రికి వెళ్లిన కజకిస్థాన్ మహిళ.. మత్తులో ఉండగా అత్యాచారం...

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (08:27 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. కజకిస్థాన్ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆర్థోస్కాపి చేసుకునేందుకు ఆస్పత్రికి ఆ మహిళకు వైద్యులు మత్తు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 9వ తేదీన ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 9వ తేదీన కజకిస్థాన్‌కు చెందిన 51 యేళ్ల మహిళ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆర్టిమిస్ ఆస్పత్రి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కోపీ చేసుకునేందుకు చేరారు. ఆమెకు 13వ తేదీన ఈ చికిత్స చేశారు. ఇందుకోసం ఆమెకు మత్తుమందు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకున్నారు. అదే అదునుగా భావించిన అటెండెంట్‌గా పని చేసే ఠాకూర్ సింగ్ (25) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
అదేసమయంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడిని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడిస్తూ, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments