Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్‌లో వార్డెన్ మృతి

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన షాక్‌కు గురైన హాస్టల్ వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాట్టు ఇతర విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అదించారు. ఈ మాటలు వినగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రెండు మరణాలతో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments