Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్...

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:10 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను సేకరించిన కొందరు పోకిరీలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు పలువురు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినిలు తమకు భయంగా ఉందంటూ ఆందోళనకు దిగడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఘట్‌కేసర్‌లో గత రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని అవుషాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. వీరిలో పలువురు పోకిరీలు ఉన్నాయి. 
 
అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలు తమ వాట్సాప్ డీపీల్లో పెట్టుకున్న ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్టు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments