Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (16:18 IST)
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ చెక్క పెట్టెలో మృతదేహం లభ్యమైంది. ఈ మర్డర్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించలేక తలలు బాదుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి.. గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడింది. 
 
ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర్ వర్మ (అలియాస్ సురేంద్రవర్మ, సుధీర్ వర్మ) ఆచూకీని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన రోజు (గురువారం) భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవరుతో.. పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
 
ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే.. అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. 
 
కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. మరోవైపు.. చెక్క పెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నసీరుల్లా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments