Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (16:18 IST)
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ చెక్క పెట్టెలో మృతదేహం లభ్యమైంది. ఈ మర్డర్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించలేక తలలు బాదుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి.. గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడింది. 
 
ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర్ వర్మ (అలియాస్ సురేంద్రవర్మ, సుధీర్ వర్మ) ఆచూకీని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన రోజు (గురువారం) భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవరుతో.. పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
 
ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే.. అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. 
 
కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. మరోవైపు.. చెక్క పెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నసీరుల్లా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments