Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దింటివాడితో కోడలు వివాహేతర సంబంధం: గంటన్నరలో నలుగురిని హత్య చేసాడు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (18:44 IST)
అద్దెకు దిగిన వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని కళ్లారా చూసాడు ఆమె మామ. కోడలు అద్దెవాడితో కులుకుతుందన్న సంగతి తెలిసి కూడా కుటుంబంలో ఎవ్వరూ ఆమెను మందలించకపోగా పట్టనట్లు వదిలేసారు. అద్దెకి దిగిన వ్యక్తి భార్య కూడా పల్లెత్తు మాట అనలేదు. అంతే... ఓ నిర్ణయానికి వచ్చేసాడతడు. ఇంటి తలుపులు వేసి ఇంట్లో మొత్తాన్ని వరసబెట్టి హత్య చేసేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా గురుగ్రాంలో ఆర్మీ మాజీ అధికారి సాయిసింగ్ యాదవ్ తన భార్య, కోడలు, కూతురుతో వుంటున్నాడు. ఇతడి ఇంట్లో ఓ జంట అద్దెకు వుంటోంది. అద్దెకు దిగిన వ్యక్తి కోడలిపై కన్నేసాడు. మాటల్లో పెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పట్టనట్లు వదిలేసారు. కానీ యాదవ్ మాత్రం రగిలిపోయాడు. కత్తి తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి తొలుత ఇంట్లో అద్దెకున్న భార్యాభర్తలను చంపేసాడు. ఆ తర్వాత తన వుంటున్న ఇంట్లోకి వచ్చి తన భార్యను, కోడలిని నరికేశాడు. ఆ సమయంలో తన చిన్నకుమార్తె అడ్డురాగా ఆమెను కూడా గాయపరిచాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments