Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దింటివాడితో కోడలు వివాహేతర సంబంధం: గంటన్నరలో నలుగురిని హత్య చేసాడు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (18:44 IST)
అద్దెకు దిగిన వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని కళ్లారా చూసాడు ఆమె మామ. కోడలు అద్దెవాడితో కులుకుతుందన్న సంగతి తెలిసి కూడా కుటుంబంలో ఎవ్వరూ ఆమెను మందలించకపోగా పట్టనట్లు వదిలేసారు. అద్దెకి దిగిన వ్యక్తి భార్య కూడా పల్లెత్తు మాట అనలేదు. అంతే... ఓ నిర్ణయానికి వచ్చేసాడతడు. ఇంటి తలుపులు వేసి ఇంట్లో మొత్తాన్ని వరసబెట్టి హత్య చేసేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా గురుగ్రాంలో ఆర్మీ మాజీ అధికారి సాయిసింగ్ యాదవ్ తన భార్య, కోడలు, కూతురుతో వుంటున్నాడు. ఇతడి ఇంట్లో ఓ జంట అద్దెకు వుంటోంది. అద్దెకు దిగిన వ్యక్తి కోడలిపై కన్నేసాడు. మాటల్లో పెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పట్టనట్లు వదిలేసారు. కానీ యాదవ్ మాత్రం రగిలిపోయాడు. కత్తి తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి తొలుత ఇంట్లో అద్దెకున్న భార్యాభర్తలను చంపేసాడు. ఆ తర్వాత తన వుంటున్న ఇంట్లోకి వచ్చి తన భార్యను, కోడలిని నరికేశాడు. ఆ సమయంలో తన చిన్నకుమార్తె అడ్డురాగా ఆమెను కూడా గాయపరిచాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments