Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:00 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై మధురవాయల్ గంగై అమ్మన్ వీధికి చెందిన రాజా (33) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కలైసెల్వి (28) ఉండగా, వీరికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. యేడాది వయస్సుండే ధనీశ్వరన్ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రాజాకు స్థానికంగా నివసించే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు జరుగతున్నాయి. ఆదివారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి చూడగా వంట గదిలో కలై సెల్వి ఉరేసుకుని కనిపించింది. 
 
దీంతో ఆయన మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కలైసెల్వి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments