Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:00 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై మధురవాయల్ గంగై అమ్మన్ వీధికి చెందిన రాజా (33) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కలైసెల్వి (28) ఉండగా, వీరికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. యేడాది వయస్సుండే ధనీశ్వరన్ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రాజాకు స్థానికంగా నివసించే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు జరుగతున్నాయి. ఆదివారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి చూడగా వంట గదిలో కలై సెల్వి ఉరేసుకుని కనిపించింది. 
 
దీంతో ఆయన మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కలైసెల్వి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments