Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:44 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో ఫోనులో చాటింగ్ చేస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లితో పాటు ఆమె కుమార్తెను కూడా హత్య చేశాడు. ఈ దారుణం రాజమండ్రి హక్కంపేట డి బ్లాకులో చోటుచేసుకుంది. మృతులను ఎండీ సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండీ సానియా (16)లుగా గుర్తించారు. ఈ హత్యల తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
పోలీసుల కథనం మేరకు.. హక్కంపేటకు చెందిన సల్మాన్ ఈవెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమెతో కలిసి నిందితుడు శివకుమార్ కూడా వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తనను కాదని మరో వ్యక్తిని సల్మాన్ చాటింగ్ చేస్తుండటాన్ని శివకుమార్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ విషయంపై ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారితీసింది. తల్లిని, కుమార్తెను హత్య చేసిన శివకుమార్ అక్కడ నుంచి నేరుగా ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments