Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!
ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:44 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో ఫోనులో చాటింగ్ చేస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లితో పాటు ఆమె కుమార్తెను కూడా హత్య చేశాడు. ఈ దారుణం రాజమండ్రి హక్కంపేట డి బ్లాకులో చోటుచేసుకుంది. మృతులను ఎండీ సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండీ సానియా (16)లుగా గుర్తించారు. ఈ హత్యల తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
పోలీసుల కథనం మేరకు.. హక్కంపేటకు చెందిన సల్మాన్ ఈవెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమెతో కలిసి నిందితుడు శివకుమార్ కూడా వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తనను కాదని మరో వ్యక్తిని సల్మాన్ చాటింగ్ చేస్తుండటాన్ని శివకుమార్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ విషయంపై ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారితీసింది. తల్లిని, కుమార్తెను హత్య చేసిన శివకుమార్ అక్కడ నుంచి నేరుగా ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments