Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని ప్రేమించిన యువకుడిని నరికి చంపి కుక్కలకు ఆహారం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (08:32 IST)
బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పరువు హత్య జరిగింది. తన చెల్లిని ప్రేమించిన ఓ యువకుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసిన కుక్కలకు ఆహారంగా వేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన బిట్టు కుమార్ అనే వ్యక్తి ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో వారు 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిట్టు ఓ యువతితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ యువతి సోదరుడు రాహుల్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని బట్టబయలు చేశాడు.
 
తన సోదరిని ప్రేమిస్తూ, ఆమెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక చంపేసినట్టు అంగీకరించాడు. ఇందులోభాగంగా, ఈ నెల 16వ తేదీన మద్యం సేవిద్దామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశానని, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలకు ఆహారంగా వేసినట్టు చెప్పాడు. మిగిలిన భాగాలను నదిలో పడేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో రాహుల్‌ను అరెస్టు చేశారు. నదిలో పడేసిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments