Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే బహిష్కరణ

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (18:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన అధికార బీజేపీ ఎమ్మెల్యేను ఆ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అత్యాచారం కేసులో కోర్టు జైలుశిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌పై ఈ చర్య తీసుకున్నారు. ఈయన గత 2014లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో 25 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ స్థానం నుంచి గోండ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోన్‌భద్రలోని ఎంపీ - ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్ తాజాగా తీర్పును వెలువరించారు. ఈ కేసులో దోషి అయిన గోండుకు రూ.10 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. 
 
ఈ మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి అప్పగించాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు ఐపీసీ 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు ఎమ్మెల్యేను దోషిగా తేల్చి పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments