Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటుకి వెళ్తున్న బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారం

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:32 IST)
సాయంత్రం పూట ప్రైవేటుకు వెళ్తున్న మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని గయాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బాలిక సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను దారిలో అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి అఘాయిత్యం చేసిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు కూడా బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఎలాగో అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments