Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంట హత్యలకు దారితీసిన అక్రమ సంబంధం... ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన జంట హత్య కేసుల్లో మిస్టరీ వీడింది. ఈ రెండు హత్యలకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. ముగ్గురు పిల్లల తల్లితో ఇద్దరు వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే ఇద్దరి ప్రాణాలకు ముప్పుగా మారింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ జంట హత్య కేసుల్లోని మిస్టరీని పరిశీలిస్తే, 
 
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిందు, దివాకర్ దంపతులు శంకరపల్లిలో ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. దివాకర్ ప్లంబర్ పనిచేస్తుండగా, ఆ సమయంలో అక్కడ హౌస్ కీపింగ్ చేసే సాకేత్ అనే వ్యక్తితో బిందుకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న దివాకర్ తన భార్యను హెచ్చరించి, తన కుటుంబాన్ని వనస్థలిపురంలోని చింతల్ కుంటకు మార్చాడు. కొన్ని రోజుల క్రితం బిందు, సాకేత్ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో దివాకర్ ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల తర్వాత సాకేత్ కనిపించడం లేదంటూ ఆయన సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 14న పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిద్దరినీ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 11వ తేదీనే వీరు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
బిందుతో సాకేత్ వ్యభిచారం చేయిస్తున్న విషయం బయటపడింది. ఈ నెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ బైకుపై బిందును తీసుకుని నానక్ రామ్ గూడ వెళ్లాడు. అక్కడ మిత్రుడి గదిలో మూడు రోజులు ఉన్నారు. 11వ తేదీన ఫోన్‌కాల్ రావడంతో బిందుతో కలిసి అనంత పద్మనాభస్వామి గుట్టల వద్దకు చేరుకున్నాడు. అక్కడ నలుగురు ఐదుగురితో కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ జరిగింది. సాకేత్‌ను వారు కత్తితో పొడవడంతో భయపడిన బిందు పారిపోయే ప్రయత్నంలో హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, బిందుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments