ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (13:21 IST)
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి రూ.2.8 కోట్లను కాజేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియరులో నిజంగానే మొబైల్ ఫోనును పంపించారు. 
 
కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్‌లోని సిమ్ తీసి కొత్త ఫోనులో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోను కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. 
 
అయితే, అప్పటికే ఆ ఫోనును తమ నియంత్రణలోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్‌వర్డ్‌లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments