Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ భర్తను, అత్తను చంపి ముక్కలు చేసిన వివాహిత!

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (14:55 IST)
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను మరిచిపోకముందే అలాంటి ఘటనే ఒకటి ఇపుడు అస్సాం రాష్ట్రంలో జరిగింది. పరాయి వ్యక్తితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నారన్న అక్కసుతో కట్టుకున్న భర్తతో పాటు అత్తను కూడా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. 
 
అస్సాం రాజధాని గౌహతికి సమీపంలోని నూన్‌మటి ప్రాంతానికి చెందిన వందన కలిత, అమర్ జ్యోతి దే అనే దంపతులు ఉన్నారు. అయితే వందనకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త, అత్త శంకరిదేవిలకు తెలియడంతో వారు వందనను హెచ్చరించారు. పైగా, ఆమె బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో తన ప్రియుడితో కలుసుకోకుండా చేసినందుకు ఆగ్రహించిన వందన.. భర్త, అత్తలను చంపేందుకు నిర్ణయించింది. 
 
ఈ విషయం తన ప్రియుడికి చెప్పగా అతను కూడా సమ్మతించాడు. ఆ తర్వాత ప్రియుడిసాయంతో భర్త, అత్తమాలను చంపేసి మృతదేహాలను ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి ప్రాంతంలో పడిసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments