Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (22:05 IST)
ఆ యువతికి 19 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటప్రాంత వాసి. పేరు హార్థిక. మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ మధ్యనే వివాహం కూడా జరిగింది. 

 
నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనం నేర్చుకుంటానని ఇంటి నుంచి వెళ్ళింది. అంతే... రాత్రంతా కనిపించకుండా పోయింది. ఈరోజు మధ్యాహ్నం పిటిఎం మండలం క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద శవమై తేలింది వివాహిత.

 
బడికాయల పల్లికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో ఇంటి నుంచి పంపేశారు తల్లిదండ్రులు. భర్త ఇంటిలో ఉన్న సమయంలో హార్థిక నిన్న ద్విచక్ర వాహనంపై  నేర్చుకుంటూ వెళ్ళింది.

 
అయితే ఇంటికి తిరిగి రాలేదు. స్థానికంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి చూశాడు భర్త. చివరకు ఈరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నానికి హార్థిక శవమై కనిపించింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హార్థిక. అయితే ఇది అనుమానాస్పద మృతి కాదు హత్యేనంటున్నాడు హార్థిక భర్త. 

 
పరువు హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రులే హార్థికను అతి కిరాతకంగా చంపేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాడు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక తరువాత పోలీసులకు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments