Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ డౌన్‌లోడింగ్‌లో జాప్యం.. కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి...

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:05 IST)
మొబైల్ ఫోనులో ఒక యాప్ డౌన్‌లోడ్ కావడంలో కాస్త జాప్యమైంది. దీంతో పట్టరాని కోపంతో కుమారుడిని ఓ కసాయి తండ్రి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్‌కు చెందిన అశోక్ సింగ్ (64) అనే వ్యక్తి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజరుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ఆదిత్య (23) కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు.
 
ఈ క్రమంలో నగదు చెల్లింపుల కోసం మొబైల్ ఫోనులో ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. కానీ, డౌన్‌లోడింగ్‌లో జాప్యం జగుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తనకు అడ్డుపడిన కొడుకును కత్తితో పొడిచాడు. 
 
ఫలితంగా ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించాల్సివచ్చింది. గాయాలకు చికిత్స చేసిన తర్వాత వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అశోక్ సింగ్‌‍పై మారణాయుధంతో కావాలని దాడికి దిగాడన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments