Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో ఒకే తాడుకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
బుధవారం, 12 జులై 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఒకే తాడుకు ఉరేసుకుంది. ఈ విషాదకర ఘటన బుధవారం చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుబ్బాకకు చెందిన మైనర్ బాలిక ఒకరు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు లచ్చాపేటకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దుబ్బాకలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమలో బుధవారం మైనర్ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఒకే తాడుకు వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరూ ఉరితాడుకు వేలాడుతుండటాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments