Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాపించి.. అమెరికా మహిళపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (20:27 IST)
భారతదేశంలోని పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన అమెరికా మహిళ అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఆ మహిళకు మద్యం తాపించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికాకు చెందిన 44 యేళ్ల మహిళ గత నల 22వ తేదీన భారత్‌కు వచ్చారు. ఆమె కేరళ రాష్ట్రంలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో బస చేస్తుంది. గత నెల 31వ తేదీన ఆశ్రమానికి సమీపంలోని బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపంచి, సిగరెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో మద్యాన్ని తాపించారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది.
 
ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బైకుపై మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిఖిల్, జయన్‌ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం