Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంచెష్టర్ సెమీ ఫైనల్ : భారత టార్గెట్ 240... రోహిత్ -కోహ్లీ ఔట్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (15:43 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోరు కేవలం నాలుగు పరుగులు మాత్రమే. ఓపెనర్ రోహిత్ శర్మ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. 
 
కాగా, మాంచెష్టర్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. అయితే, కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వు డేకు వాయిదాపడింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద నుంచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
 
అయితే బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా వేసిన త్రోకు టేలర్ (74) రనౌట్ అయ్యాడు. ఆ తర్వత భువనేశ్వర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన నీషమ్, హెన్రీ (1)లు ఔట్ అయ్యారు. అప్పటికి కివీస్ స్కోరు 49 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 
 
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లో గుప్తిల్ 1, నికోల్స్ 28, విలియమ్సన్ 67, టేలర్ 74, నషీమ్ 12, గ్రాండ్‌హో 16, లాథమ్ 10, సంత్నెర్ 9, హెన్రీ 1, బోల్ట్ 3 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. హెన్రీ వేసిన బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ తన తొలి వికెట్‌ను నాలుగు పరుగుల వద్ద కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments