Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ జట్టుకి పిచ్చెక్కిపోతోంది... జుట్టు పీక్కుంటున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (21:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్‌ బెర్త్ పైన పాకిస్తాన్ జట్టుకు పిచ్చెక్కిపోతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఏదో ఇంగ్లాండ్ జట్టుని భారత జట్టు ఓడిస్తుందనుకుంటే అది కాస్తా ఆవిరయ్యింది. ఇప్పుడు 3వ స్థానంలో వున్న న్యూజీలాండ్ కూడా ఇంగ్లాండుపై ఓడిపోయే స్థితిలో వుంది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను వమ్ము అవుతున్నాయి. కాగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకుని దర్జాగా వెయిట్ చేస్తున్నాయి. 
 
ఇక ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు జట్లు సెమీ ఫైనల్‌కు పోటీ పడుతున్నాయి. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి. 11 పాయింట్లతో వున్న న్యూజిలాండ్ జట్టు బుధవారం ఇంగ్లాండుతో పోరాడుతోంది. దాదాపు గెలిచే పరిస్థితి లేదు. 10 పాయింట్లతో వున్న ఇంగ్లాండు గెలిస్తే ఆ జట్టుకి 12 పాయింట్లు రానున్నాయి. కనుక ఇంగ్లాండు సెమీస్ లోకి అడుగెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
కాబట్టి పోటీ ఇక న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్యనే వుంటుంది. పాకిస్తాన్ జట్టుకి 9 పాయింట్లు వున్నాయి. బంగ్లాదేశ్ జట్టుపైన పాక్ గెలిచినా న్యూజీలాండ్-పాక్ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు వుంటాయి. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లడమే. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments