Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ స్టేడియంలో విజయ్ మాల్యా.. ''దొంగ దొంగ'' అని అరిచిన జనం..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (12:19 IST)
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు లిక్కర్ కింగ్ మాల్యా వచ్చాడు. ఈ మ్యాచ్‌‌ను తిలకించేందుకు విజయ్ మాల్యా రావడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కర్ణాటకకు చెందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సంస్థను స్థాపించారు. విమాన సర్వీసులను కూడా నడిపారు. 
 
అయితే భారత బ్యాంకుల్లో 9వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని కేసు నమోదైంది. బ్యాంకులకు అనుకున్న మొత్తాన్ని చెల్లించకుండా.. లండన్‌కు పారిపోయిన మాల్యాను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఇంగ్లండ్ వద్ద అభ్యర్థిస్తూ వినతి పత్రాన్ని సమర్పించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు మాల్యా వచ్చాడు. ఆపై కొన్ని ఫోటోలకు మాల్యా ఫోజిచ్చాడు. ఆ సమయంలో మాల్యాకు తీరని అవమానం జరిగింది. అక్కడున్న ప్రజల్లో కొందరు హిందీలో ''దొంగ దొంగ'' అంటూ అరిచారు. దీంతో స్టేడియంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో విజయ్ మాల్యా అక్కడ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments