Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంచెష్టర్‌లో మంచు లక్ష్మి సందడి... వికెట్ కోల్పోయిన భారత్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (16:41 IST)
ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను తిలకించేందుకు భారత్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు విదేశాలకు వెళుతుంటారు. ఇలా టాలీవుడ్‌కు చెందిన నటి మంచు లక్ష్మి కూడా ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లింది. ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆమె ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానికి వెళ్లి సందడి చేశారు. భారత బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినపుడల్లా ఆమె త్రివర్ణ పతకాలను ఊపుతూ భారత ఆటగాళ్ళను ప్రోత్సహించారు. 
 
మరోవైపు, భారత తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద ఔటౌయ్యాడు. ఈయన మొత్తం 78 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేయగా, ఇందులో రెండు సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 24.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments