Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్‌కు చుక్కలు చూపిన ఆప్ఘాన్ స్పిన్నర్లు

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (11:42 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, శనివారం భారత్ - ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినంతపనైంది. చివరకు గుడ్డిలో మెల్లగా విజయం సాధించింది. దీనికి కారణం ఆప్ఘాన్ స్పిన్నర్లు. మొత్తం 50 ఓవర్లకు గాను 32 ఓవర్లు వేసిన ఆప్ఘాన్ స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్లను ఓ ఆట ఆడుకున్నారు. 32 ఓవర్లు వేసి 119 పరుగులు ఇచ్చిన స్పిన్నర్లు 5 వికెట్లు తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంటే భీకర ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో ఆప్ఘాన్ బౌలర్లు అత్యంత కీలక పాత్రను పోషించారని చెప్పొచ్చు. 
 
భారత్‌ 224 పరుగులకే కట్టడి కావడంలో ఆప్ఘాన్ స్పిన్నర్లది కీలక పాత్ర. ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు ముజీబ్‌ రెహ్మాన్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబి.. పార్ట్‌టైం స్పిన్నర్‌ రహ్మత్‌ షా కలిపి 50 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లు వేయడం విశేషం. 3.5 ఎకానమీతో 119 పరుగులు మాత్రమే ఇచ్చిన వీరు.. 5 వికెట్లు పడగొట్టారు. 
 
ఈ గణాంకాల్ని బట్టే ఆప్ఘాన్ స్పిన్నర్లు బలమైన భారత బ్యాటింగ్‌ను ఎంతగా పరీక్షించారో అర్థమవుతుంది. ఆప్ఘాన్ బౌలింగ్‌ దాడి మొదలైందే స్పిన్‌తో. ముజీబ్‌ రెహ్మాన్‌ కొత్త బంతితో చాలా ప్రభావవంతంగా బౌలింగ్‌ చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేసి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆద్యంతం స్పిన్నర్ల హవా నడిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments