Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ఓడించి హీరోలుగా మారండి : పాకిస్థాన్ కోచ్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:42 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్ జట్టు సభ్యులకు ఓ సలహా ఇచ్చారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో శక్తినంతా ధారపోసి, విజయం సాధించి హీరోలుగా మిగిలిపోవాలని పిలుపునిచ్చారు. 
 
ఇంగ్లండ్ వేదికగా గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మాంచస్టర్ వేదికగా ఈ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌ తమకు ఎంతో ఆసక్తిగా ఉందని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ చెప్పాడు.  
 
దీనిపై ఆయన స్పందిస్తూ, భారత్‌ను ఈసారి ఓడించి.. తమ క్రికెటర్లు హీరో అవ్వాలని పిలుపునిచ్చారు. "మ్యాచ్‌లో జరిగే ఘటనలే మీ కెరీర్‌లో కీలకమవుతుంది. మీరు మ్యాచ్‌లో అదరగొడితే.. మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు" అంటూ  ఆటగాళ్లతో చెప్పినట్టు వెల్లడించాడు. 
 
"సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఫలితంగా ఇరు జట్ల ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ, మా జట్టు ఆటగాళ్లు మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతారు. మాకు అందిన అవకాశాలను వినియోగించుకొని విజయం సాధిస్తాం" అని ఆర్థర్ వెల్లడించారు. 
 
ఈ టోర్నమెంట్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. న్యూజిలాండ్‌తో జరిగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో కాస్త నిరాశకు గురైంది. దీంతో పాకిస్థాన్‌పై ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఓడని భారత్.. ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments