Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:14 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఓ ఓటమిని జీర్ణించుకోలేని అభిమాని ఒకరు టీవీ చూస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన పిచ్చి. దీంతో భారత ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తూ వస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాటం చేసినప్పటికీ.. 18 పరుగులు తేడాతో ఓడిపోక తప్పలేదు. ఎంతో ఉత్కంఠకు రేపిన ఈ మ్యాచ్‌ను చూస్తూ అతను టెన్షన్‌కు గురయ్యాడు. భారత ఓడిపోతుందని తెలియడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాముకు గుండెపోటు రావడంతో టీవీ ముందే కుప్పకూలిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ విగతజీవుడిగా మారిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి టీవీలో మ్యాచ్‌ను వీక్షించిన రాము... కొన్ని క్షణాల్లో తీరని లోకాలకు చేరుకోవడంతో గ్రామవాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments