Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:14 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఓ ఓటమిని జీర్ణించుకోలేని అభిమాని ఒకరు టీవీ చూస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన పిచ్చి. దీంతో భారత ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తూ వస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాటం చేసినప్పటికీ.. 18 పరుగులు తేడాతో ఓడిపోక తప్పలేదు. ఎంతో ఉత్కంఠకు రేపిన ఈ మ్యాచ్‌ను చూస్తూ అతను టెన్షన్‌కు గురయ్యాడు. భారత ఓడిపోతుందని తెలియడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాముకు గుండెపోటు రావడంతో టీవీ ముందే కుప్పకూలిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ విగతజీవుడిగా మారిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి టీవీలో మ్యాచ్‌ను వీక్షించిన రాము... కొన్ని క్షణాల్లో తీరని లోకాలకు చేరుకోవడంతో గ్రామవాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

తర్వాతి కథనం
Show comments