Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఓడిపోయింది.. అభిమాని గుండె ఆగింది...

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:14 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఓ ఓటమిని జీర్ణించుకోలేని అభిమాని ఒకరు టీవీ చూస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన పిచ్చి. దీంతో భారత ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తూ వస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత పోరాటం చేసినప్పటికీ.. 18 పరుగులు తేడాతో ఓడిపోక తప్పలేదు. ఎంతో ఉత్కంఠకు రేపిన ఈ మ్యాచ్‌ను చూస్తూ అతను టెన్షన్‌కు గురయ్యాడు. భారత ఓడిపోతుందని తెలియడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాముకు గుండెపోటు రావడంతో టీవీ ముందే కుప్పకూలిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ విగతజీవుడిగా మారిపోయాడు. అప్పటివరకు తమతో కలిసి టీవీలో మ్యాచ్‌ను వీక్షించిన రాము... కొన్ని క్షణాల్లో తీరని లోకాలకు చేరుకోవడంతో గ్రామవాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments