Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే టీమిండియా ఓడిపోయిందా? తలబాదుకుంటున్న నెటిజన్లు

టాస్ గెలిచి కూడా టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఫైనల్ విజేత ఎవరో తేలిపోయిందా? పాకిస్తాన్ క్రికెట్ జట్టు కళ్లముందే ఐసీసీ ట్రోఫీని ఎగురేసుకుపోయాక బాధ భరించలేకపోతున్న నెటిజన్లు ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (02:24 IST)
టాస్ గెలిచి కూడా టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోకుండా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఫైనల్ విజేత ఎవరో తేలిపోయిందా? పాకిస్తాన్ క్రికెట్ జట్టు కళ్లముందే ఐసీసీ ట్రోఫీని ఎగురేసుకుపోయాక బాధ భరించలేకపోతున్న నెటిజన్లు ఇదే ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ రికార్డు ఎంత పేలవంగా ఉందో తెలిసి కూడా ముందుగా దానికి బ్యాంటింగ్ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడే టీమిండియాకు జరగకూడదనిది జరిగిపోయిందని నెటిజన్ల అనుమానం.
 
ఇటీవల జరిగిన ఏ కీలకమైన టోర్నీ ఫైనల్లోనూ టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న సందర్భాలు లేవని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు లక్ష్య ఛేదనకు అవకాశం ఇస్తే వారికున్న బ్యాటింగ్ బలంతో సులభంగా ఆటను ఎగరేసుకుపోతారన్నే భయంతో నాటి భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసీస్‌కు మొదట బ్యాటింగ్‌కు అవకాశం ఇచ్చి తప్పటడుగు వేశాడని చెబుతున్నారు. 
 
కానీ ఈరోజు కేవలం అహంకారం, నిర్లక్ష్యం కారణంగానే కోహ్లీ వెనకూ ముందూ చూసుకోకుండా టాస్ గెలిచి కూడా పాక్ టీమ్‌కు బ్యాటింగ్ అప్పగించాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ ఇంతవరకు 250 పరుగులకు మించిన లక్ష్య ఛేదనను మేజర్ టోర్నీలో సాధించలేకపోయిందని చెబుతున్నారు. కీలకమైన ఫైనల్స్‌లో స్కోర్ బోర్డ్ ఒత్తిడి అనేది ఏ జట్టుమీదైనా పనిచేస్తుందని. ప్రత్యర్థి అంచనాకు మంచి పరుగులు చేస్తే దాని ప్రభావం ఛేదన జట్టుపై తప్పక ఉంటుందని వీరంటున్నారు. 
 
ఏదేమైనా పాక్ జట్టు ఈ విజయంతో ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్యాట్స్‌మెన్ రాజ్యమేలుతున్న నేటి క్రికెట్‌లోనూ మంచి బౌలింగే అంతిమంగా మ్యాచ్‌లను గెలిపిస్తుందని పాక్ నిరూపించిందని నెటిజన్ల అభిప్రాయం.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments