Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గేమూ గెలుస్తామని ఏమైనా రాసిచ్చామా? ఓటమిని అంగీకరించాల్సిందే అన్న కోహ్లీ

వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (05:57 IST)
వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరు కారణంగానే తాము ఓడిపోయామని, ప్రత్యర్థి ప్రదర్శనను కూడా ఒక్కోసారి మనం గుర్తించాల్సి ఉంటుందని కోహ్లీ సమర్థించుకున్నాడు. అయితే ఏ జట్టూ అజేయంగా కొనసాగలేదని, పరాజయాలు ప్రతి జట్టుకూ సహజమేనని కోహ్లీ తత్వంలోకి వెళ్లిపోయాడు.
 
ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్‌ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు. మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్‌ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments