Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గేమూ గెలుస్తామని ఏమైనా రాసిచ్చామా? ఓటమిని అంగీకరించాల్సిందే అన్న కోహ్లీ

వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (05:57 IST)
వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరు కారణంగానే తాము ఓడిపోయామని, ప్రత్యర్థి ప్రదర్శనను కూడా ఒక్కోసారి మనం గుర్తించాల్సి ఉంటుందని కోహ్లీ సమర్థించుకున్నాడు. అయితే ఏ జట్టూ అజేయంగా కొనసాగలేదని, పరాజయాలు ప్రతి జట్టుకూ సహజమేనని కోహ్లీ తత్వంలోకి వెళ్లిపోయాడు.
 
ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్‌ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు. మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్‌ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments