Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావో రేవో అంటున్న లంక... సెమీ ఫైనల్‌ లక్ష్యంగా టీమిండియా

గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (07:51 IST)
గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంక తమ బలహీనతను చూపించింది. కెఫ్టెన్ మాథ్యూస్‌ గాయపడటం, మరో కీలక ఆటగాడు ఉపుల్ తరంగ నిషేధంతో మ్యాచ్‌కు దూరం కావడంతో శ్రీలంకపై భారత్ విజయం ఏకపక్షంలానే కనిపిస్తోంది. 
 
నాలుగేళ్ల కిందట ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్‌ట్రోఫీలో విజేతగా నిలిచిన భారతజట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే పునరవృతం చేయాలని భావిస్తోంది. టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడిన తొలిమ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో రాణించింది.  మరోవైపు  టైటిల్‌ ఫేవరెట్‌ భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి రెండు వరుస విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. 
 
2015 వన్డే ప్రపంచకప్‌ తర్వాత దిగ్గజాలు మహేల జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకోవడంతో లంక జట్టు సంధి దశలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాక నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌ కొరత జట్టును వేధిస్తోంది. దీంతో ఈ టోర్నీలో లంక పోరు నామమాత్రంగానే ఉండనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో 96 పరుగులతో చిత్తుగా ఓడింది. దీంతో భారత్‌తో పోరులో దూకుడు చూపించాల్సిందేనని మాజీ క్రికెటర్‌ సంగక్కర.. యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకపోయినా.. రెండో భర్త నుంచి భరణం పొందొచ్చు.. ఎలా?

అది లేకుండా విజయవాడ రోడ్లపై తిరిగితే రూ. 10 వేలు ఫైన్: ద్విచక్రవాహనదారులకు వార్నింగ్

చదువుకోసం స్కూలుకు పంపితే.. మీ టీచర్లు గర్భవతిని చేశారు.. హెచ్ఎం వద్ద ఓ తల్లి ఆవేదన

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యను లోబరుచుకున్నాడు.. చివరకు భర్త చేతిలో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

తర్వాతి కథనం
Show comments