చావో రేవో అంటున్న లంక... సెమీ ఫైనల్‌ లక్ష్యంగా టీమిండియా

గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (07:51 IST)
గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంక తమ బలహీనతను చూపించింది. కెఫ్టెన్ మాథ్యూస్‌ గాయపడటం, మరో కీలక ఆటగాడు ఉపుల్ తరంగ నిషేధంతో మ్యాచ్‌కు దూరం కావడంతో శ్రీలంకపై భారత్ విజయం ఏకపక్షంలానే కనిపిస్తోంది. 
 
నాలుగేళ్ల కిందట ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్‌ట్రోఫీలో విజేతగా నిలిచిన భారతజట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే పునరవృతం చేయాలని భావిస్తోంది. టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడిన తొలిమ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో రాణించింది.  మరోవైపు  టైటిల్‌ ఫేవరెట్‌ భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి రెండు వరుస విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. 
 
2015 వన్డే ప్రపంచకప్‌ తర్వాత దిగ్గజాలు మహేల జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకోవడంతో లంక జట్టు సంధి దశలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాక నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌ కొరత జట్టును వేధిస్తోంది. దీంతో ఈ టోర్నీలో లంక పోరు నామమాత్రంగానే ఉండనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో 96 పరుగులతో చిత్తుగా ఓడింది. దీంతో భారత్‌తో పోరులో దూకుడు చూపించాల్సిందేనని మాజీ క్రికెటర్‌ సంగక్కర.. యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలానికి బైబై.. తెలంగాణలో పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

ఏపీలో బిల్ గేట్స్.. ఘన స్వాగతం పలికిన నారా లోకేష్- సచివాలయంలో ఏపీ సీఎంతో భేటీ..

ఉత్తర కొరియాలో వారసత్వ పోరు.. కిమ్ కుమార్తెతో పోటీ పడుతున్న సోదరి

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

Mani Ratnam: తు యా మైన్ చిత్రంపై మణిరత్నం ప్రశంసల జల్లు

Shivani Nagaram: కాత్యాయని పాట ఎందుకు హిట్ అయిందో తెలిదు :శివాని నాగరం

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

తర్వాతి కథనం
Show comments