Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ఓడించటం మావల్లకాదు.. ముందుగానే చేతులెత్తేసిన లంక

మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, గెలవాలంటే మాత్రం తాము అత్యుత్తమ ప్రదర్శన చేయవలసి ఉంటుందని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ మాథ్యూస్ చెప్పాడు. దీంతో ఆట మొదలు కాకముందే శ్రీలంక తమ నిస్సహాయతను చాటుకున్నట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భా

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (06:11 IST)
మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, గెలవాలంటే మాత్రం తాము అత్యుత్తమ ప్రదర్శన చేయవలసి ఉంటుందని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ మాథ్యూస్ చెప్పాడు. దీంతో ఆట మొదలు కాకముందే శ్రీలంక తమ నిస్సహాయతను చాటుకున్నట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పాక్‌పై నెగ్గిన భారత్ ఊపు మీద ఉండగా సౌతాఫ్రికాపై ఓడిన శ్రీలంక జట్టుకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. 
 
ఈ నేపథ్యంలో లంక కెప్టెన్ మాథ్యూస్ మాట్లాడుతూ భారత్ జట్టు చాలా బాగా ఆడుతుందని చెప్పాడు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని అన్నాడు. మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, అందుకు తాము ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుందని మాథ్యూస్ చెప్పాడు.
 
భారత్‌పై గెలుపు సాధించాలంటే ఆది నుంచి అఫెన్స్ లోకి వెళ్లడమే ఏకైక మార్గమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగాక్కర శ్రీలంక జట్టుకు సూచించాడు. అన్ని ఫార్మేట్లలోనూ బలంగా ఉన్న టీమిండియాతో ఢిపెన్స్‌ ఆడే పని పెట్టుకోవద్దని, ఎదురు దాడి చేస్తేనే ఆటను లంక తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉందని సంగాక్కర స్పష్టం చేశాడు. 
 
లండన్‌ చాంపియన్స్‌ట్రోఫీ సెమీఫైనల్లో చోటే లక్ష్యంగా గురువారం శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి నాకౌట్‌ దశకు అర్హత సాధించాలని భావిస్తోంది. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments