Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ బలం, బలహీనత మాకు తెలుసు.. విజేతలుగానే ఫైనల్‌కు సిద్ధపడతామన్న కోహ్లీ

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదన

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (02:22 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలో ఘోరంగా ఆడి భారత్ల చేతిలో చిత్తయినప్పటికీ అనూహ్యంగా కోలుకుని
వరుసుగా మూడు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన రీతిలో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తేల్చి చెప్పాడు. పాక్ బలం, బలహీనతలు మాకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ ప్రాతిపదికనే మేం పథక రచన చేపడతామని, జట్టులో భారీ మార్పులు చేయవలసిన అవసరం లేదని కోహ్లీ తెలిపాడు.
 
భారత్, పాక్‌ హై ఓల్టేజి ఫైనల్‌ మ్యాచ్‌ గురించి మాత్రం కోహ్లి చాలా తేలిగ్గానే స్పందించాడు. ‘ఇప్పటిదాకా మేం కొనసాగించిన ఆటనే ఫైనల్లోనూ ప్రదర్శిస్తాం. పాక్‌ బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మా ప్రణాళికలు ఉంటాయి. కానీ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సమష్టిగా మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఫైనల్‌ రోజు మా స్థాయికి తగ్గ ఆటను మైదానంలో కనబరిస్తే ఫలితం అదే వస్తుంది. ముందుగానే ఎవరినీ విజేతలుగా అంచనా వేయలేం. ఇప్పటిదాకా కొన్ని ఆశ్చర్యకర ఫలితాలను చూశాం’ అని కోహ్లి తెలిపాడు. 
 
చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ ప్రదర్శన ఆకట్టుకుందని కొనియాడాడు. ఓ జట్టు మంచి క్రికెట్‌ ఆడితేనే ఫైనల్‌కు వస్తుందని, పరిస్థితులను వారికి అనుకూలంగా మలుచుకుని అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించి భారత్‌.. మరో సెమీస్‌లో ఊపుమీదున్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాక్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అనంతరం తాను సన్నద్ధమైన తీరు ప్రస్తుత టోర్నీలో ఫలితం చూపిస్తోందని చెప్పాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమేనని చెప్పాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments