Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో

Webdunia
శనివారం, 1 జులై 2017 (01:26 IST)
నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య  జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో విజయం భారత్‌వైపే మొగ్గు చూపుతోంది. తొలి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు తర్వాత కాస్త నిలకడ ప్రదర్శించి పరుగుల వేగం పెంచినప్పటికీ వరుసగా వికెట్లు కూలడంతో అపజయానికి చేరువవుతున్న స్థితి కనబడుతోంది. 
 
ప్రస్తుతం 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 125 పరుగులు చేసింది. టీమిండియా పేసర్లు పాండ్యా 2, ఉమేష్ 1 వికెట్లు పడగొట్టగా అశ్విన్, కులదీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టి  విండీస్ పరుగుల జోరుకు కళ్లెం వేశారు. 24 ఓవర్లలో 127 పరుగులు చేయవలసిన విండీస్‌కి ప్రస్తుతం జరుగుతున్నా ఆటతీరు చూస్తే చేదన కష్టమేననిపిస్తోంది. ఆరో వికెట్ కూడా కోల్పోవాల్సిన విండీస్ జట్టు అశ్విన్ వైడ్ వేయడంతో ఊపిరి పీల్చుకుంది.
 
అంతకుముందు స్లో పిచ్‌పై పరుగులు తీయడమే గగనమైపోయిన టీమిండియా జట్టు చివర్లో మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోనీ, కేదార్ జాదవ్ స్పూర్తిదాయకమైన ఆట తీరులో 4 వికెట్ల నష్టానికి 251 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. శిఖర్ ధావన్ 2, కోహ్లీ 11 పరుగులకే ఔటై వెనుదిరిగిన స్థితిలో టీమిండియా డిఫెన్సుకు పోవడంతో పరుగులు వేగం బాగా మందగించింది.

రహానే, యువరాజ్ నిలదొక్కుకోవడంతో ఒకమేరకు పరుగులు లభించాయి వీరిద్దరి ఔట్‌లో ధోనీ, కేదార్ జాదవ్ చివరి 8 ఓవర్లలో మెరుపులు కురిపించారు. ఒక దశలో 200 పరుగులు కూడ రావడం గగనమనుకున్న స్థితిలో వరుసు సిక్సర్లతో ధోనీ, కేదార్ విండీస్ బౌలర్ల పని పట్టారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments