Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు : బీసీసీఐ

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (22:13 IST)
క్రికెట్ సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో సాగుతున్న పర్యటనలో టీమిండియా, విండీస్ మధ్య మిగతా అన్ని మ్యాచ్‌లనూ నిలిపివేయాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐకి తన నిర్ణయం తెలిపింది. అటు ఆటగాళ్ళు కూడా తమ బోర్డు వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు. సొంత ఖర్చులతో స్వదేశం వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, "ఆటగాళ్ళతో వివాదాల కారణంగా విండీస్ బోర్డు మిగతా మ్యాచ్‌లను రద్దు చేయాలంటూ బీసీసీఐకి సమాచారం అందించింది. ఆటగాళ్ళలో అంతర్గత సమస్యలే తమ నిర్ణయానికి కారణమని చెప్పింది. దీనిపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేసి, అటుపై, న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తున్నాం. విండీస్ బోర్డు నిర్ణయం తమను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments