Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : విరాట్ కోహ్లీ - భువనేశ్వర్‌లకు చోటు!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:59 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకుల పట్టికలో భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలోనూ, బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌లు ఏడో స్థానంలో ఉన్నారు. 
 
అయితే, బ్యాటింగ్ విభాగంలో సఫారీ స్టార్ ఏబీ డీవిలీర్స్ అగ్రస్థానం పదిలపరుచుకోగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఏబీకి కోహ్లీకి మధ్య 25 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. మూడోస్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా నిలిచాడు. ఇక, బౌలింగ్ విభాగంలో భారత యువ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ స్థానం ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. 
 
ఈ జాబితాలో, సస్పెన్షన్‌కు గురైన పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండో ర్యాంకులో, సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నాలుగోస్థానంలో నిలిచాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments