Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సెంచరీ బాదుడు: రైనా, రహానే అదుర్స్.. టీమిండియా 330 రన్స్!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:58 IST)
ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాడిలో పడ్డాడు. ఇంతకాలం ఫామ్ లేమితో ఇక్కట్లు పడిన విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. అలాగే కోహ్లీ రైనాకు చక్కటి సహకారం అందించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
 
టీమిండియా, విండీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భాగంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల పతనానికి 330 పరుగులు సాధించింది. 
 
విరాట్ కోహ్లీ విమర్శకులకు తన బ్యాటింగ్ సమాధానమిస్తూ.. 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 127 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. అతనికి రైనా (71), రహానే (68) అద్భుత సహకారమందించారు. 
 
ఇంకా ధావన్ (35) కూడా రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్, రసెల్, బెన్ తలో వికెట్ తీశారు. తద్వారా భారత్ 331 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్దేశించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments