Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై: డ్రెస్సింగ్‌ రూంలో మాత్రం ఉద్వేగానికి..?

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (14:37 IST)
టెస్టు క్రికెట్‌కు ధోనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ మంగళవారం నాడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని కూడా విలేకరుల సమావేశంలో ఎలాంటి భావోద్వేగం లేకుండా మ్యాచ్ గురించి మాట్లాడేసి వెళ్లిపోయాడు.
 
అయితే, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో మాత్రం కొంత ఉద్వేగానికి గురయ్యాడు. భారత దేశానికి అత్యధిక మ్యాచ్‌లు నాయకత్వం వహించని, అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్, టెస్టుల్లో టీమ్ ఇండియాను నెంబర్ వన్‌గా నిలిపిన సారథి, వరుసగా 11 సిరీస్‌లలో ఓటమి ఎగరని ధోనీ, భారత్‌కు అత్యధిక సిరీస్ విజయాలు సాధించాడు.
 
టెస్టు కెప్టెన్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. టెస్ట్ సారథిగా ఇన్ని ఘనతలు సాధించిన వ్యక్తి ధోనీ. మరోవైపు, విదేశాల్లో అత్యధిక సిరీస్‌లు, అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ ధోనీయే కావడం గమనార్హం. 
 
విదేశాల్లో అత్యంత ఘోర పరాభవాలు ఎదురైంది కూడా అతడి నాయకత్వంలోనే. సారథిగా ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో అన్ని విమర్శలు వచ్చాయి. సారథిగా స్వర్ణయుగం చూడటంతో పాటు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే అతను ప్రశంసలకు పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు. ఏ సందర్భంలోనైనా ప్రశాంతంగా ఉన్నాడు. తన పని తాను చేసుకు పోయాడు. అయితే టెస్టు ఫార్మాట్‌కు మాత్రం ధోనీ గుడ్ బై చెప్పేశాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments