Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిశాస్త్రి నింపిన ఆత్మ విశ్వాసంతోనే రెచ్చిపోయా : సురేష్ రైనా

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (13:09 IST)
భారత క్రికెట్ జట్టు‌కు డైరక్టర్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో రెచ్చిపోయినట్టు టీమిండియా యువ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రైనా సెంచరీతో వీరవిహారం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో 75 బంతులను ఎదుర్కొన్న సురేష్ రైనా.. 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 
 
ఈ ప్రదర్శనపై సురేష్ రైనా స్పందిస్తూ దీటైన ఆటను ప్రదర్శించు... అంటూ టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసమే తన మెరుగైన ప్రదర్శనకు కారణమన్నారు. రెండో వన్డేలో చెలరేగి పోవేలా చేసిన తన ఆత్మవిశ్వాసానికి కారణం రవిశాస్త్రి మాటలేనని తెలిపాడు. రవిశాస్త్రి చెప్పిన మాటలు జట్టులో ఆత్మవిశ్వాసం ప్రోది చేశాయన్నారు. బస్సులో వెళ్తుండగా తన పక్కన కూర్చున్న రవిశాస్త్రి మైదానంలో ఎలా ఆడితే ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తామో చెప్పారని రైనా తెలిపారు. ఇందుకు రవిశాస్త్రితో పాటు.. సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments