ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు దారుణ వైఫల్యాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ముఖ్యంగా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ తీరును విమర్శించాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాంత శర్మ జట్టుకు భారమని నిప్పులు చెరిగాడు. అతని వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగించడం ఉత్తమని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్తో పాటు.. అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్లలో భారత జట్టుతో పాటు.. బౌలర్లు పూర్తిగా విఫలమైన విషయం తెల్సిందే. ఫలితంగా టెస్ట్ సిరీస్ను కోల్పోగా, వరుసగా రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయాడు.
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ వరల్డ్కప్ తుది జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ ఇషాంత్ శర్మ టీమ్కు భారమని నిప్పులు చెరిగాడు. విదేశీ పర్యటనల నుంచి వారు నేర్చుకున్నదేమీ లేదన్నాడు. వరల్డ్కప్ దగ్గపడుతున్నకొద్దీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నాడు. ఆరంభంలో వికెట్లు దక్కించుకోకపోతే.. బౌలర్గా ఇషాంత్ నిరర్థకుడని వ్యాఖ్యానించాడు.