Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్‌తో సహా ఏడుగురి పేర్లు.. సుప్రీం వెల్లడి

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (19:34 IST)
భారత్ క్రికెట్‌ను ఒక కుదుపు కుదుపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్‌‌ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో 13 పేర్లకు గాను ఏడు పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది.
 
భారత క్రికెట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాత్ర ఉన్న ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై జస్టీస్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని ఈ పేర్లను వెల్లడించింది. 
 
ఈ నివేదికలో మొత్తం 13 మంది పేర్లు ఉండగా, వారిలో ఏడుగురు పేర్లను వెల్లడించింది. ఇందులో ఇందులో ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ(భారత్), ఓవైషా (ఇంగ్లాండ్), శామ్యూల్ బాడ్రీ (వెస్టిండిస్), బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, మాజీ ఐపీఎల్ ఆఫీసర్ సుందర్ రామన్‌ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24కు తేదీకి వాయిదా వేసింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments